వరంగల్ రూరల్ : జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. జాతీయ రహదారి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుని వ్యక్తి మృతి చెందాడని మృతుని బంధువులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.