ఆదిలాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ లో ఐ లవ్ cci పేరిట సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు పలువురు సెల్ఫీ దిగుతూ ఫొటోలను వాట్సాప్ గ్రూప్ లు, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.