హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ).. బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది.
ఇందుకోసం బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ డైరెక్టర్ సతీశ్ కుమార్, ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ వెంకటరమణతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీఐవో) డాక్టర్ శాంతా తౌటం శనివారం ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. ఇదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థ శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్తో ఒప్పందాలను కుదుర్చుకొన్నట్టు టీఎస్ఐసీ ప్రతినిధి వెల్లడించారు.