హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): బాధితుల పక్షాన నిలుస్తూ సత్వర న్యాయం అందేలా తెలంగాణ సమాచార కమిషన్ కృషి చేస్తున్నది. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 17 ఏండ్లు పూర్తయింది. తొలిసారి 2017 సెప్టెంబర్ 25న ప్రధాన కమిషనర్గా రాజా సదారాం, కమిషనర్గా సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళితో సమాచార కమిషన్ ఏర్పడింది.
అప్పటికే 8 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సదారాం పదవీ విరమణ తర్వాత బుద్దా మురళి ప్రధాన కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో మరో ఐదుగురు కమిషనర్లను నియమించింది. సీనియర్ జర్నలిస్టులు కట్టాశేఖర్రెడ్డి, ఎం నారాయణరెడ్డి, గుగులోత్ శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్లు కమిషనర్లుగా బాధ్యతలు తీసున్నారు. ఇప్పటివరకు 40 వేల దరఖాస్తులు రాగా.. 35 వేలకు పైగా పరిష్కరించింది.