మెండోరా, జూలై 7 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ మాధురి తెలిపారు.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి మరింత వరద పెరిగే అవకాశముందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1070.70 అడుగుల (30.360 టీఎంసీల) నీటినిల్వ ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్టు నీటి మట్టం 1070.40అడుగులు (29.722 టీఎంసీల)గా ఉన్నది.