హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి కోరారు. ఎమర్జెన్సీ తీవ్రతను గుర్తించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్కు అనుమతిచ్చారు. దీంతో విమానం సేఫ్గా ల్యాండవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సిబ్బందితోపాటు 144 మంది ప్రయాణిస్తున్నారు.
గత నెల 21న శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సుమారు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం విమానాన్ని పైలట్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నారు.