హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పీవీ నర్సింహారావుకు భారతరత్న రావటం పట్ల ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తంచేశారు. పీవీకి భారతరత్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషికి దక్కిన ఫలితంగా వారు అభివర్ణించారు. సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్లో బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్, పీవీ జయంతోత్సవాల కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన మహేశ్ బిగాల, సిడ్నీ డిప్యూటీ మేయర్ శాండీరెడ్డి, పలువురు ప్రవాసులతో కలిసి పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.