Foreign Education | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఫాల్ సీజన్ ప్రవేశాల్లో (సెప్టెంబర్-డిసెంబర్) భారతీ య విద్యార్థులు అత్యధికంగా అడ్మిషన్లు పొందుతున్నారు. చైనా ను వెనక్కినెట్టి మనోళ్లే ముందువరుసలో నిలుస్తున్నారు. విదేశీ చదువుల పట్ల గల క్రేజ్, ఫారిన్ డిగ్రీలకున్న ప్రాధాన్యంతో అత్యధికులు విదేశీ చదువు ల పట్ల మోజు పెంచుకుంటున్నారు. స్కాలర్షిప్పులు, ప్రో త్సాహకాలు లభిస్తుండటంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాదీ చైనా కంటే మన విద్యార్థులే అత్యధికంగా విదేశీ చదువులకు దరఖాస్తులు సమర్పించారు. చైనా నుంచి ఎన్రోల్మెంట్ తగ్గడంతో చాలా వర్సిటీలు ఇప్పుడు మన దేశంపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యోకెట్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ జైన్ వెల్లడించారు. గతంతో పొల్చితే ఫాల్ సీజన్ ప్రవేశాలు రెట్టింపైనట్టు పలు విదేశీ విద్యా కన్సల్టెన్సీలు వెల్లడించాయి. సురక్షిత వాతావరణం, జీవన వ్యయం, పార్ట్టైమ్ ఉద్యోగాల వంటి వాటిని భారతీయ తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.