హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రవేశపెట్టిన ‘భారత్ గౌరవ్’ రైలు శనివారం సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైంది. ఎస్సీఆర్ జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్లు అందజేశారు. యాత్రికులను అలరించేందుకు కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ జైన్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆసక్తితో పాటు పుణ్య క్షేత్రాలు, వాటి ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను రూపొందించారని చెప్పారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యక్షేత్రాలు చూసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. యాత్రికుల నుంచి వంద శాతం ఆదరణ లభించడంతో ఎస్సీఆర్ జీఎం సం తోషం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన యాత్రికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, ఇతర రైల్వేకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.