హైదరాబాద్: సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ భారత ప్రధాని దేశాన్ని దివాళా తీస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం చాలా హీనస్థితికి చేరిందన్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉందన్నారు. గడిచిన 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం కూడా ఏర్పడిందన్నారు. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా మన దగ్గర ఉన్నట్లు మంత్రి తెలిపారు. అమెరికాతో డాలర్తో పోలిస్తే ఇండియాలో ప్రస్తుతం రూపాయి విలువ అత్యంత దారుణంగా పతనమైందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
Amused to read that UK PM Liz Truss resigned in less than 45 days for her failed economic policy!
In India, we have a PM who gave us;
❇️ Highest unemployment in 30 years
❇️ Highest Inflation in 45 years
❇️ Highest LPG price in the world
❇️ Lowest Rupee Vs USD#TolerantIndia— KTR (@KTRTRS) October 21, 2022
కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్ బాబు కూడా భారత్లో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా అధికంగా ఉందని, నిరుద్యోగ యువత అధిక స్థాయిలో ఉందని, రూపాయి విలువ కూడా షాకింగ్ రీతిలో పతనమైనట్లు ప్రొఫెసర్ కౌశిక్ చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచంలోనే ముందున్న ఇండియాకు ఇలాంటి అంశాలు చేదు చేస్తాయని కౌశిక్ తన ట్వీట్లో తెలిపారు. ఈ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయని, కానీ విభజించు పాలించు అనే రాజకీయాలు ఈ సమస్యల్ని మరింత పెద్దవిగా మారుస్తున్నట్లు ప్రొఫెసర్ కౌశిక్ తెలిపారు.
Inflation moderately high, youth unemployment shockingly high, the rupee shockingly low. These are sad facts for a nation that was a global frontrunner till a few years ago. There are many factors behind these weaknesses but one common driver is the politics of divide and rule.
— Kaushik Basu (@kaushikcbasu) October 21, 2022