యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి వారి భక్తులు తమ మొబైల్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్ చేసి, విరాళం అందించొచ్చని తెలిపారు.
తమకు తోచిన సాయం చేసి బంగారు తాపడం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాతలు బ్యాంక్కు నేరుగా రాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే విరాళం అందజేసేందుకు బ్యాంక్ క్యూ ఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇది యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఇండియన్ బ్యాంక్కు చెందిన క్యూ ఆర్ కోడ్ అని ఈఓ గీత తెలిపారు.