హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు.
విద్య, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల రంగాల్లో ఉన్నత సేవలు అందించినవారికి నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్నీ యూనియన్, బ్రిటిష్ కౌన్సిల్, బ్రిటన్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ అవార్డును అందజేసింది.