వనపర్తి : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఓ అద్భుత ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా మంత్రి స్వయంగా తయారు చేయించిన 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు.
అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రికార్డు స్థాయిలో మూడు కిలోమీటర్లు పొడవు జాతీయ జెండా ప్రదర్శించడం ఓ అద్భుత ఘట్టం అన్నారు.
స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన పోరాటయోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ 2 వారాల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబురాలకు రూపకల్పన చేశారన్నారు.