శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది జెండాను ఆవిష్కరించారు. గంగాధర మండపం నుంచి ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం గణపతిపూజతో జెండా పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవస్థానం భక్తులకు కల్పించిన సౌకర్యాల ప్రగతిని వివరించారు. జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా విభాగం వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన విభాగాధిపతులతోపాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.