హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణసమీకరణ ఇండెంట్ పెట్టింది. 17న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని నాలుగు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. 33 ఏండ్ల కాలానికి రూ.1,000 కోట్లు, 34 ఏండ్ల కాలానికి రూ.1,000 కోట్లు, 35 ఏండ్ల కాలానికి మరో రూ.1,000 కోట్లు, 36 ఏండ్ల కాల పరిమితితో ఇంకో రూ.1000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టు శుక్రవారం రిజర్వు బ్యాంకు వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపించింది. కానీ, ఇప్పటికే ప్రతిపాదించిన మొత్తం తీసుకున్న ప్రభుత్వ అదనంగా రుణ సమీకరణ చేయబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ. 64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.