Telangana | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ సమయంతో పోల్చితే ప్రస్తుతం విద్యుత్తురంగంలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించినట్టు శ్వేతపత్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ఏర్పాటు సమయానికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు వినియోగం ఉండగా, ప్రస్తుతం అది 19,475 మెగావాట్లకు చేరినట్టు ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొన్నది.
రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పూర్తయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తయింది. 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశను 48 నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రూ. 8.01కోట్లతో పూర్తిచేశారు. రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి.