కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో చేపట్టిన రైతాంగ కార్యక్రమాలతో రైతులకు వ్యవసాయంపై పూర్తి నమ్మకం పెరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula ) పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. చెరువుల్లో నీరు లేక, పంటలకు నీరందక, విద్యుత్, విత్తనాల కొరత, పంటలు పండితే కొనవారు లేక అనేక సమస్యలతో బాధపడేవారని గుర్తు చేశారు. సాగు నీటి కోసం పక్కనున్న గ్రామాల రైతులతో యుద్ధాలు జరిగేవని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రైతుల ముఖ చిత్రం మొత్తం మారిపోయిందని వెల్లడించారు.
పంటలకు సాగునీరు(Irrgation), ఉచిత కరెంట్(Free Power), పంట పెట్టుబడికి రైతు బంధు, రైతు బీమలాంటి ఎన్నో పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంట రుణాలు నాటి సమాక్య పాలకులు ఆంధ్రకు తరలించి తెలంగాణ రైతుకు తీరని నష్టం చేశారని తెలిపారు. నేడు కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని వివరించారు.