చిక్కడపల్లి, మార్చి 7 : వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను నిలదీశారు. గురువారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి ఆయన రాగా, అభ్యర్థులు ప్రశ్నల వర్షం కురిపించారు.
గ్రూ ప్స్లో పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లలోని ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి.. మీరే ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం ఏమిటని నిలదీశారు.