జనగామ : ప్రజల్లో పోలీసు పట్ల నమ్మకాన్ని పెంపోందించే విధంగా విధులు నిర్వర్తించాలని వంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీసులకు పిలుపునిచ్చారు. సీపీ బుధవారం జిల్లాలోని నర్మెట, తరిగొప్పుల పోలీస్ స్టేషన్లు సందర్శించారు. పోలీస్ స్టేషన్, సిబ్బంది గృహసముదాలను పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు ఆహ్లదకరంగా కనిపించే విధంగా మొక్కల పెంపకం చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరాల వివరాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ అరా తీసారు. సీపీ వెస్ట్ జోన్ శ్రీనివాస్ రెడ్డి, జనగాం ఏసీపీ వినోద్, ట్రైనీ ఎస్ఐతో ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి