హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/ పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వచ్చి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పటాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్, విలాస్ పాలి మర్స్ పరిశ్రమలు ఉన్నాయి. బొల్లారం పారిశ్రామికవాడలో ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పరిశ్రమ నిర్వహిస్తున్నారు. అయితే.. తమిళనాడు కు చెందిన ఎక్సెల్ గ్రూప్ రబ్బర్ ఎగుమతుల్లో ప్రముఖమైనది. ఎగుమతు ల్లో అవకతవకలు, పన్ను చెల్లింపులో మోసం జరుగుతున్నదనే ప్రధాన ఆరో పణపై ఆదాయ శాఖ అధికారులు రైడింగ్ చేశారని తెలుస్తున్నది.
20 బృందా లుగా విడిపోయిన ఐటీ అధికారులు గచ్చిబౌలిలోని ఎక్సెల్ కంపెనీ కార్యాల యం, మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. సుమారు 60 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఎక్సెల్ గ్రూప్ ఇన్ఫ్రా, ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్కేర్ రంగాల్లో కంపెనీలు నడుపుతున్నది. హైదరాబాద్లోని బాచుపల్లి, చందా నగర్లో ఉన్న సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగా యి. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు వెల్లడించ లేదు. పరిశ్రమ వర్గాలు సైతం ఈ విషయమై గోప్యత పాటిస్తున్నాయి.