హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హయత్లో ఫెడరేషన్ ఆఫ్ తె లంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ (ఎఫ్టీసీసీఐ) సీఈవోల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “శాంతి-శ్రేయస్సు- వ్యాపా ర రంగంలో పురోగతి” అనే థీమ్తో నిర్వహించిన ఇంటరాక్టివ్ భేటీలో రజత్కుమార్ మాట్లాడుతూ ఎనిమిదేండ్ల అతి స్వల్పకాలం లో తెలంగాణ రాష్ట్రం రెట్టింపుస్థాయిలో అభివృద్ధి చెందినదని తెలిపారు. ఇందుకు రాష్ట్రం లో శాంతి, సౌభాగ్యాలు, ప్రగతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత విధానాలే కారణమని పేర్కొన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ శాంతి, శ్రేయస్సుకు అవినాభా వ సంబంధముంటున్నదని పేర్కొంటూ ఆర్థికాభివృద్ధికి శాంతి పునాది అని అభివర్ణించా రు. ఫోరం సీఈవో ఎంఎస్ కీర్తి నరవాణే నేతృత్వం వహించిన ఈ సమావేశంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, సీఈవో ఫోరం కన్వీనర్ భాసర్రెడ్డి, సువెన్ ఫార్మా లిమిటెడ్ ఎండీ వెంకట్జాస్తి, వైస్ ప్రె సిడెంట్లు మీలా జయదేవ్, సురేశ్ సింఘాల్, చీఫ్ అడ్వైజర్ బీపీ ఆచార్య, ఎఫ్టీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్ను ఎన్డబ్ల్యూడీఏ ఆహ్వానించాలి?
ఈ నెల 6న జరిగే గోదావరి-కావేరి రివర్ లింక్ ప్రాజెక్టు టాస్క్ఫోర్స్ సమావేశానికి ఛత్తీస్గఢ్ను ఆహ్వానించకపోవడంపై తె లంగాణ సర్కారు నేషనల్ వాటర్ డెవలప్మెట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ఎన్డబ్ల్యూడీఏకు శుక్రవారం లేఖ రాసింది. సమావేశంలో అర్థవంతమైన చర్చ సాగాలంటే ఛత్తీస్గఢ్కు కచ్చితంగా పులువాల్సిందేనని సూచించింది. గోదావరి-కృష్ణ-పెన్నా- కావేరి నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ ఆయా రివర్ బేసిన్లోని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలతో ఇప్పటికే పలుమార్లు కీలక సమావేశాలను నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నది. రాష్ర్టాలతో ఈ నెల 6న రివర్ లింక్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ సమావే శం నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చినా ఛత్తీస్గఢ్ను మాత్రం ఆ సమావేశానికి ఆహ్వానించలేదు. గోదావరి నుంచి చుక్క నీటిని ముట్టుకోబోమని, ఛత్తీస్గఢ్ నుంచి దిగువకు వృథాగా వస్తున్న, ఆ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీల జలాలనే, అది కూడా మహానది నుంచి నీటిని మళ్లించేంత వరకు తాత్కాలికంగానే కావేరికి తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ వెల్లడించింది. ఈ కొత్త ప్రతిపాదనపై ఛత్తీస్గఢ్ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కీలక సమావేశానికి ఎన్డబ్ల్యూడీఏ ఛత్తీస్గఢ్ను మాత్రం ఆహ్వానించకపోవడంపై ఇం జినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.