ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 2న ఖమ్మంకు రావాల్సి ఉన్నప్పటికీ.. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా పర్యటన రద్దయింది. ఈ నెల 4న ఖమ్మానికి మంత్రి కేటీఆర్ రానున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం వెల్లడించారు. పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు వివరించారు.