తాడూరు, మార్చి 5: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో తాడూరు మండలం సిర్సవాడ, ఎట్టిధర్పల్లి గ్రామాలకు చెందిన 60 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.