ములుగు :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. కాగా, సినీ నటుడు ఫిష్ వెంకట్ రామప్ప సందర్శించి పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున రామప్పలో స్వామి వారికి పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు.