హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : మహరాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఈ నెల 24న బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. బూటకపు ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలేనంటూ పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై వెంటనే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ మంగు, వర్గేశ్, రాజు, బుద్రామ్లకు విషంపెట్టి, ప్రాణాలతో పట్టుకొని, క్రూరంగా హింసించి ఉదయం ఆరు గంటలకు కాల్చి చంపి.. ఎప్పటిలాగే ఎదురు కాల్పుల కట్టుకథ అల్లారని లేఖలో పేర్కొన్నారు.