BJP | పెద్దపల్లి, మే 6 (నమస్తే తెలంగాణ)/నీలగిరి/నల్లగొండ రూరల్/చౌటుప్పల్ : నల్లగొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్నారు.
ఈ సభకు 3 వేల నుంచి 4 వేల మందికి మించి రాలేదు. దీంతో సభకు వచ్చిన వారు బయటకు వెళ్లిపోకుండా బీజేపీ కార్యకర్తలు బౌన్సర్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. చౌటుప్పల్లోని తంగడపల్లి సభ, పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభలో కూడా జనం లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.