కోనరావుపేట, సెప్టెంబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చిరుత పులి, పిల్లల సంచారం కలకలం రేపింది. రైతు గంగారం శుక్రవారం ఉదయం కోనరావుపేట నుంచి శివంగాళపల్లికి వెళ్లే దారిలో పశువులను తీసుకెళ్తుండగా చిరుతపులి కనిపించింది. వెంటనే పక్కకు నక్కాడు.
కొద్దిసేపటి తర్వాత అదే ప్రాంతంలో రెండు చిరుతపులి పిల్లలు కనిపించాయి. పరుగున వెళ్లి గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థులతోపాటు ఎఫ్ఎస్వో బాపురాజు అక్కడికి చేరుకొని పరిశీలించగా ఒక చిరుత పిల్ల కనిపించింది. మరో కూనను చిరుత ఎత్తుకొని పోయినట్టు భావిస్తున్నారు. ఈ పిల్లను సైతం చిరుతకు కనిపించేలా పొదల్లో ఉంచారు.