మద్దూర్ (కొత్తపల్లి), ఏప్రిల్ 2 : సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని వాల్యానాయక్ తండాలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో మంగళవారం ఖాళీ బిందెలతో రోడెక్కి తండావాసులు నిరసన తెలిపారు.