హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే ఆవేదనతో, ఫ్రస్ట్రేషన్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేవెళ్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలపై అమిత్ షా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదన్నారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలపై ఆ ప్రభుత్వాలు ఎలాంటి విచారణ జరిపించాయో అమిత్ షా చెప్పాలని నిలదీశారు. మోదీ సీఎంగా, అమిత్ షా హోం మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో 10 ఏండ్లలో 15 పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయని, గత ఎనిమిదేండ్లలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని చెప్పారు. గుజరాత్లో ఎన్నిసార్లు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారు? అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో మొత్తం 118 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, వీటిలో ఎన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని నిలదీశారు.
మధ్యప్రదేశ్లో వ్యాపం సామ్తో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసు విచారణ సమయంలో సాక్షులు, కేసు విచారించిన వాళ్లు అనుమానాస్పదంగా మరణించారని, దీని గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో పేపర్ లీకేజీ జరిగినట్టుగా ప్రభుత్వమే గుర్తించి దర్యాప్తునకు ఆదేశించిందని గుర్తు చేశారు. మారణహోమం సృష్టించి రాష్ట్ర బహిషరణకు గురైన అమిత్ షా తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘బిలిస్ బానోపై లైంగిక దాడి చేసి.. వారి కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితులను జైలు నుంచి విడిపించి సన్మానాలు చేసిన దుర్మార్గులు. ప్రపంచం మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్న తెలంగాణపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటిదే అవుతుంది’ అని స్పష్టం చేశారు. ‘అధికారం ఇవ్వండని ఎంత బతిమిలాడినా, సాష్టాంగ నమసారాలు చేసినా.. మీ దుర్మార్గ పాలనను ఏ ఒక పౌరుడు కోరుకోడు. మిమ్మల్ని తెలంగాణ పొలిమేరలోనే పాతి పెట్టడం పకా’ అని ట్వీట్ చేశారు.