ఖమ్మం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.20వేల కోట్ల ఖర్చుతో 4500 కిలో మీటర్లు జాతీయ రహదారులను నిర్మించామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం వేశామని వెల్లడించారు. ఈ పాలసీ ఇండియా లో ఎక్కడ లేదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీలు నామా నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ కుకురాకూల నాగభూషణo , డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు , రైతు బంధు కమిటీ కన్వీనర్ నల్లమళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.