హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండలం.. 28 గ్రామాలతో భోరజ్ మండలాన్ని ఏర్పాటు చేశారు.
జైనథ్, ఆదిలాబాద్ రూరల్, బేల మండలాల్లోని గ్రామాలతో సాత్నాల.. జైనథ్ మండలంలోని కొన్ని గ్రామాలతో భోరజ్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.