వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మెరుగైన విద్య, వైద్యం అందించాల్లన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు మండలం గుమ్మడంలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డిజిటల్ క్లాసులతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త తరహా బోధన చేపడుతామన్నారు.
విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకుకొస్తున్నాం. మన ఊరు-మన బడి కోసం ప్రభుత్వం రూ.9,123 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సర్కారు బడులు, కళాశాలలు బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే వైద్యరంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. పేదలు విద్య, వైద్యం కోసం ఇబ్బంది పడొద్దనే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్నారు.