నల్లగొండ, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణప్రతినిధి): తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధులందరీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చే యాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరుసగా చేస్తున్న డిక్లరేషన్లన్నీ ఆచరణ సాధ్యం కానివేనన్నారు.
కాంగ్రెస్ నేత ల మధ్య ఐక్యతనే ఉండదని, అలాంటి వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనుకోవడం భ్రమనేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాం గ్రెస్ నేతల మా టలు నమ్మి మోసపోవద్దని కోరారు. సీఎం కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని అన్నారు. కేసీఆర్తోనే ఏదైనా సాధ్యమని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీతోపాటు చెప్పని ఎన్నో పనులు చేసి చూపించిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు.