హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఒక శాతం చందాతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కోరింది. టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ శనివారం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో సమావేశమై ఈహెచ్ఎస్ అమలుపై చర్చించారు. త్వరలో ఆరోగ్యశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని రిజ్వీ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.