Summer | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో గురువారం అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో 42.9, కొమ్రుంభీం జిల్లా ఆసిఫాబాద్లో 42.5, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.