అచ్చంపేట, సెప్టెంబర్ 14 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.
అక్కడి నుంచి అంబులెన్స్లో అచ్చంపేట ప్ర భుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థిను లు కడుపునొప్పి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. కొందరి పరిస్థితి ఇబ్బందిగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి సత్యవతిరాథోడ్, విప్ గువ్వల బాలరాజు స్పం దించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అం దేలా చూడాలని అధికారులను ఆదేశించారు.