శంషాబాద్, జూన్ 24 :శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో స్మగ్లింగ్ గూడ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న షార్జా నుంచి జీ9458 విమానంలో హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీచేశారు. అందులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్యాకెట్లలో 80 ఐఫోన్లు గుర్తించారు. వారి నుంచి ఆ ఐఫోన్లు, 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.