సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్కు (IID Hyderabad) చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్.. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈక్రమంలో బుధవారం లాడ్జిపైనుంచి దూకి ఆత్మహత్య చేసకుఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతనెల 31న ఎంటెక్ విద్యార్థి రాహూల్ తానుంటున్న హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఆయన.. ఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రాహూల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.