బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా బందర్పల్లికి చెందిన అరవింద్ ఇంటికి వెళ్లి ఈ నెల 12న తిరిగి వర్సిటీకి వచ్చాడని అధికారులు తెలిపారు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు.
ఇదే విషయమై అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అధికారులు.. అతడిని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్లోనే ఉన్నాడు. అయితే తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన తర్వాత అతడు ఉరివేసుకున్నడాని, ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.