న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని తెలంగాణభవన్లో తెలంగాణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉద్యోగులు, భవన్ కార్మికులు, సమీపంలోని ముస్లింలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్దాస్ రంజాన్ పండుగ విశిష్టతను కొనియాడారు.కార్యక్రమంలో తెలంగాణ రెసిడెంట్ డిప్యూటీ కమిషనర్, ఏపీ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.