Jupally Krishna Rao | గంజాయి, డ్రగ్స్, నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రజల ప్రాణాల రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. ఎక్సైజ్ శాఖ భవన్లో అధికారులతో జూపల్లి కృష్ణారావు శనివారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎస్టీఎఫ్ టీమ్లు, మంచిగా పని చేసేవారికి అవసరమైతే ఆయుధాలను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు మంచిగా పని చేసే వారిని గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలని మంత్రి అదేశించారు.
నల్ల బెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. ఎక్సైజ్శాఖ పట్టుకున్న నల్ల బెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గ దర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నప్పుడు వాటిని పగులగొట్టకుండా, వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వాటిని జాతీయ ఉత్పత్తిగా గుర్తించి అమ్మకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
గంజాయితోపాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణా, వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని మంత్రి జూపల్లి సూచించారు. నాచారం, చర్లపల్లి లాంటి ఇన్లీగల్ పరిశ్రమలను తనిఖీలు చేపట్టడానికి అవసరమైన కార్యచరణ తయారు చేసుకోవాలని సూచించారు. ఒకే లైసెన్స్పై ఒకటి కంటే ఎక్కువ బార్లు నడుపుతున్నారని పలువురుపై ఆరోపణలను వస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, బ్రాండీ షాపుల సిట్టింగ్ రైమ్లపై నిబంధనలు పాటించాలా చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న రైస్ మిల్లులను, ఇతర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.