హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): నైని టెండర్ను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార విషయాలను పకదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి మీడియా సమావేశంలో పేర్కొన్న అంశాలపై స్పందిస్తూ శనివారం ప్రకటన విడుదల చేశారు. స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ది బుష్ లా ఏదో చెప్పి, మసిపూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. ‘మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్రెడ్డి బామ్మర్ది రింగ్ లీడర్గా పాత్ర పోషించింది నిజం.. సిరుల గని సింగరేణిని సృజన్ గనిగా మార్చింది నిజం.. ఏ సామ్ జరగకుంటే నైని టెండర్లను రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు?’ అని నిలదీశారు. తాను తాజాగా బయటపెట్టిన సోలార్ పవర్ సామ్ గురించి ఎందుకు ఒక మాట కూడా ప్రెస్మీట్లో మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
అన్ని టెండర్లు ఎందుకు రద్దు చేయలే?
నైనిని రద్దు చేసినట్టే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని హరీశ్ ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్ధాలు అయిపోవని, జరిగిన సామ్లు సీమ్లుగా మారిపోవని స్పష్టంచేశారు. సైట్ విజిట్ నిబంధన 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. అది తప్పు కాకుంటే నైని టెండర్లు ఎందుకు రద్దు చేసినట్టు? అని నిలదీశారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘సైట్ విజిట్ అమలైంది.. నైని టెండర్ రద్దయింది అంటే.. సామ్ జరిగినట్టే కదా?’ అని ప్రశ్నించారు. ‘భట్టి గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవనే ఉద్దేశంతోనే లేఖ రాశాను. మీరు నిజంగా రేవంత్రెడ్డి, ఆయన బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్ధం’ అని హరీశ్ పేర్కొన్నారు.
మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్రెడ్డి బామ్మర్ది రింగ్ లీడర్గా పాత్ర పోషించింది నిజం.. సిరుల గని సింగరేణిని సృజన్ గనిగా మార్చింది నిజం.. ఏ సామ్ జరుగకుంటే నైని టెండర్లను రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు? భట్టి గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐ మాత్రమే చేయగలవనే ఉద్దేశంతో లేఖ రాసిన. మీరు నిజంగా రేవంత్రెడ్డి, ఆయన బావమరిది కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా.
– హరీశ్రావు