నోటిఫికేషన్ విడుదల.. జూలై 27, 28న పరీక్ష
ఆగస్టు 22న ఫలితాల వెల్లడి
హైదరాబాద్, మార్చి 30 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కేయూ వీసీ ప్రొఫెసర్ టీ రమేశ్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి బుధవారం విడుదల చేశారు. జూలై 27, 28 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పద్ధతిలో మూడు సెషన్లల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు 14 ప్రాంతీయ కేంద్రాలు, 75 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.
దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.450, ఇతర అభ్యర్థులు రూ.650 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో 25 శాతం మార్కులొస్తే అభ్యర్థులు క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫయింగ్ మార్కులు లేవు. ఐసెట్కు హాజరైతే సీట్లు కేటాయిస్తారు. వివరాలకు https //icet.tsche.ac.in చూడవచ్చు.