హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు సంస్థల సీఎండీలుగా ఐఏఎస్ అధికారులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ (ఎఫ్ఏసీ)గా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ విద్యుత్తు సౌధలో బాధ్యతలు స్వీకరించారు. ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించారు.
దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీగా ముషారఫ్ ఫారూఖీ మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో, వరంగల్లోని ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) కార్యాలయంలో సీఎండీగా వరుణ్రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.