హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణ బకాయిల్లో 30 శాతం చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. వీటికి సంబంధించి ఎన్సీసీ లిమిటెడ్కు చెల్లించాల్సిన రూ.180.17 కోట్ల బకాయిల్లో 30 శాతాన్ని ఈ నెల 23లోగా చెల్లిస్తామని తెలిపింది.
బకాయిలను చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయలేదంటూ ఎన్సీసీ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్ను జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారించారు. గత ఉత్తర్వుల మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.