హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతీరోజు తానే పరిశీలిస్తానని పీఆర్ఆర్డీ శాఖ మంత్రి సీతక స్పష్టం చేశారు. శనివారం పీఆర్, సెర్ప్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవన నిర్మాణాల పురోగతిపై రోజువారీగా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమీ క్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పనులు, గ్రామ మహిళా సమా ఖ్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాల ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చే యాలని ఆదేశించారు.