హైదరాబాద్ ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రా నేతలకు అభివృద్ధి చేయటం చేతకాదు కానీ.. వ్యక్తిగత దూషణలకు మాత్రం దిగుతారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బూతులు తిట్టటంలో ఏపీ నేతలు వారికి వారే సాటి అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్ప ఏనాడైనా అభివృద్ధి గురించి చర్చించారా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రాకు ఏమేమి కావాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్పై మాట్లాడే ధైర్యం లేదు కానీ.. హరీశ్రావుపై అక్కసు వెళ్లగక్కటం మాత్రం వచ్చని తెలిపారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు ఓటు హక్కును ఎందుకు బదిలీ చేసుకుంటున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.