న్యూఢిల్లీ, మార్చి 3: సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఏ రకమైన తిరుగుబాటు చేయాల్సిన అవసరం తనకు లేదని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ చేయాలన్న ఆసక్తి కానీ, కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలని కానీ తనకు లేవని చెప్పారు. తాను పోరాట యోధుడినే కానీ, తన పోరాటం పార్టీపై కాదని ఆయన తెలిపారు. సీఎం పదవి ఖాళీ అవుతుందని, అది దళితులకు దక్కాలని కొందరు అంటున్నారని, తాను ఎన్నడూ ఆ మాట అనలేదని ఆయన స్పష్టం చేశారు.