నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఓ మహిళ సజీవ దహనమవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే గుడిసెలో అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించారు.
కాగా, బాధితులు హైదరాబాద్కు చెందినవారని తెలిపారు. మతిస్థిమితం బాగాలేకపోవడంతో దర్గాకు వచ్చారని చెప్పారు. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే మహిళ సజీవదహనమయ్యారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.