హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలోని వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి.